రూ.2 లక్షల సెల్‌ఫోన్లు స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-19T05:26:09+05:30 IST

వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 15 సెల్‌ఫోన్లు (2లక్షల రూపాయలు) స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గంగిరెడ్డి గురువారం తెలిపారు.

రూ.2 లక్షల సెల్‌ఫోన్లు స్వాధీనం

పుంగనూరు రూరల్‌, ఆగస్టు 18: వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 15 సెల్‌ఫోన్లు (2లక్షల రూపాయలు) స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గంగిరెడ్డి గురువారం తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సాంకేతిక పద్ధతిలో ఈ సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటిని బాధితులకు త్వరలోనే అందిజేస్తామన్నారు. రద్దీ గల ప్రాంతాలో దుండగులు డబ్బు, సెల్‌ఫోన్లు అపహరిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లు రీకవరీ చేయడానికి కృషి చేసిన సిబ్బంది ఎల్లప్ప, కేశవరాజు, రవికుమార్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మోహన్‌కుమార్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-19T05:26:09+05:30 IST