TS News: కొత్త పార్లమెంట్ భవనానికి కేంద్రం అంబేద్కర్ పేరు పెట్టాలి
ABN , First Publish Date - 2022-09-16T00:51:34+05:30 IST
Hyderabad: నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) సూచించడంపై టీఆర్ఎస్ (TRS) శ్రేణుల్లో వర్షం వ్యక్తమవుతోంది. పార్టీ నేతలు, ప్రజాప్రతినిథులు సీఎం నిర్ణయాన్ని
Hyderabad: నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) సూచించడంపై టీఆర్ఎస్ (TRS) శ్రేణుల్లో వర్షం వ్యక్తమవుతోంది. పార్టీ నేతలు, ప్రజాప్రతినిథులు సీఎం నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) మాట్లాడారు. కొత్త సెక్రటేరియట్కు సీఎం అంబేద్కర్ పేరు పెట్టి దళితులు, బీసీ,ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీదున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని, కేంద్రం కూడా కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టి చిత్తశుద్ది నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. దళితుల ఓట్లను ఆకర్షించడంలో భాగంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నరన్న బీజేపీ శ్రేణుల ఆరోపణలు పనికిమాలినవని తలసాని పేర్కొన్నారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. సీఎంది చారిత్రక నిర్ణయమని, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శమని ఆమె పేర్కొన్నారు.