కేంద్ర, రాష్ట్ర సర్కార్లు రైతులను మోసం చేస్తున్నాయి: రేవంత్
ABN , First Publish Date - 2021-11-18T21:09:49+05:30 IST
కేంద్ర, రాష్ట్ర సర్కార్లు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర సర్కార్లు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, ఇందిరాపార్క్ దగ్గర ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా..? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కళ్లాల దగ్గరకు వెళ్ళాలన్నారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు. బీజేపీ నేత బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు. 19వ తేదీ నుంచి 23 వరకు కళ్లాల్లోకి కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు. ఈ నెల 23 వరకు కేసీఆర్కు సమయం ఇస్తున్నామని, తర్వాత రైతులతో కలిసి ప్రగతిభవన్ ముట్టడిస్తామని రేవంత్రెడ్డి హెచ్చరించారు.