వరద నష్టం అంచనాకునేడు, రేపు కేంద్ర బృందం పర్యటన

ABN , First Publish Date - 2021-11-26T08:07:06+05:30 IST

వరదల కారణంగా ఈనెల 13 నుంచి 20వ తేదీవరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం శుక్ర, శనివారాల్లో జిల్లాలో పర్యటించనుంది.

వరద నష్టం అంచనాకునేడు, రేపు కేంద్ర బృందం పర్యటన

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 25: వరదల కారణంగా ఈనెల 13 నుంచి 20వ తేదీవరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం శుక్ర, శనివారాల్లో జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అడ్వైజర్‌ (ఎన్టీఎంఏ) కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన రెండు కేంద్ర బృందాలు రానున్నాయి.  

Updated Date - 2021-11-26T08:07:06+05:30 IST