ఏపీకి కేంద్ర పర్యావరణశాఖ షాక్

ABN , First Publish Date - 2022-01-25T23:10:06+05:30 IST

ఏపీకి కేంద్ర పర్యావరణశాఖ షాక్ ఇచ్చింది. ఏపీలోని

ఏపీకి కేంద్ర పర్యావరణశాఖ షాక్

అమరావతి: ఏపీకి కేంద్ర పర్యావరణశాఖ షాక్ ఇచ్చింది. ఏపీలోని అవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లు చేపట్టాలంటే పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్జీటీలో కేంద్ర పర్యావరణశాఖ నివేదిక దాఖలు చేసింది. 3 రిజర్వాయర్లు గాలేరు‌-నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసిందిజ శ్రీశైలం జలాలను చిత్తూరుకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 వేల కోట్లతో 3 రిజర్వాయర్లు, ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రతిపాదించింది. అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌లు చేపట్టారని బాధితులు ఎన్జీటీని ఆశ్రయించారు. ప్రత్యామ్నాయ భూములు అందుబాటులో ఉన్నా పంట పొలాలను ముంచేలా రిజర్వాయర్లను రూపొందించారని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో ఈ మూడు ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తమ వైఖరి తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టులపై ఇకపై పనులు చేపట్టబోమని ఏపీ అండర్ టేకింగ్ ఇచ్చింది. కేంద్రం వైఖరితో రిజర్వాయర్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. 


Updated Date - 2022-01-25T23:10:06+05:30 IST