కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం.. దుష్ర్ర్పచారం చేస్తున్నారని వెల్లడి

ABN , First Publish Date - 2022-02-16T00:37:40+05:30 IST

పొలాలకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని ...

కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం.. దుష్ర్ర్పచారం చేస్తున్నారని వెల్లడి

హైదరాబాద్: పొలాలకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని ఒత్తిడి చేసినట్లు కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాలపై కేంద్రం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేసింది. కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, పునరుత్పాదక విద్యుత్‌ను కొనాలని కేంద్రం ఒత్తిడి చేయడం లేదని వెల్లడించింది. ఫలానా వారి దగ్గరే కొనాలని తాము చెప్పలేదని, ఎవరినుంచైనా కొనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని తెలిపింది. హైడ్రో పవర్‌ గురించి కేసీఆర్ మాట్లడుతున్నారని, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రూ.55 వేల కోట్లు అప్పు ఇచ్చాయని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. 


Updated Date - 2022-02-16T00:37:40+05:30 IST