AP News: మోదీ సర్కార్‌ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-07-24T18:23:34+05:30 IST

కేంద్రప్రభుత్వం (Central Govt)పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

AP News: మోదీ సర్కార్‌ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది: తులసిరెడ్డి

అమరావతి: కేంద్రప్రభుత్వం (Central Govt)పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కార్‌ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ (CBI) సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ (Prime Minister Modi), కేంద్రమంత్రి అమిత్‌షాకు కాంగ్రెస్‌ నేతలు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మోదీ పాలనలో దేశం, జగన్ పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. సీఎం జగన్ (CM Jagan) రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని తులసిరెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2022-07-24T18:23:34+05:30 IST