విద్యుత్ సంక్షోభంపై కేంద్రం ఫోకస్

ABN , First Publish Date - 2021-10-12T17:45:25+05:30 IST

న్యూఢిల్లీ: విద్యుత్ సంక్షోభంపై కేంద్రం ఫోకస్ పెట్టింది

విద్యుత్ సంక్షోభంపై కేంద్రం ఫోకస్

న్యూఢిల్లీ: విద్యుత్ సంక్షోభంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. బొగ్గు కొరతతో పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు నెలకొనడంపై దృష్టి సారించింది. దేశంలో విద్యుత్ సంక్షోభం వస్తుందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం పీఎంవో సమీక్ష నిర్వహించనుంది. అసలు దేశంలో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎన్ని, వాటికున్న బొగ్గు నిల్వలు ఏ మేరకు ఉన్నాయి.. ఇప్పటి వరకు బొగ్గు నిల్వలు అడుగంటిపోవడానికి గల కారణాలేంటి? వాటికి సంబంధించి కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖ ఏయే చర్యలు చేపట్టాయన్న విషయంపై పీఎంవో సమీక్ష నిర్వహించనుంది. నిన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా దీనిపై సమీక్ష నిర్వహించారు.

Updated Date - 2021-10-12T17:45:25+05:30 IST