కేసీఆర్‌పై యుద్ధం చేయండి: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-12-21T21:43:12+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలని బీజేపీ నాయకులకు

కేసీఆర్‌పై యుద్ధం చేయండి: అమిత్‌షా

ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలని బీజేపీ నాయకులకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా సూచించారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలన్నారు. కేసీఆర్‌ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏమి చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని నాయకులకు అమిత్‌షా హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-12-21T21:43:12+05:30 IST