రైతుల ఆందోళనలపై నడ్డా నివాసంలో కేంద్రమంత్రుల అత్యవసర భేటీ
ABN , First Publish Date - 2020-11-30T03:59:20+05:30 IST
రైతుల ఆందోళనలపై నడ్డా నివాసంలో కేంద్రమంత్రుల అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలపై కేంద్రం.. సీరియస్గా దృష్టి సారించింది. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకులు అత్యవసరంగా భేటీ అయ్యారు. జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్, నరేంద్రసింగ్ తోమర్ హాజరయ్యారు. రైతుల ఆందోళనలు తీవ్రతరం అవుతుండడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.