29న నగరానికి రానున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ABN , First Publish Date - 2022-04-28T22:08:49+05:30 IST
కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం హైదరాబాద్కు రానున్నారు. ఈసందర్భంగా రెండుజాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు.
హైదరాబాద్: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం హైదరాబాద్కు రానున్నారు. ఈసందర్భంగా రెండుజాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. మరో 10 జాతీయ రహదారులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేస్తారు. అలాగే శంషాబాద్లో జరిగే కార్యక్రమానికి కూడా నితిన్ గడ్కరీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు కేంద్రపర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి కూడా ఆయన వెంట ఉంటారు. రూ.7,853 కోట్ల వ్యయంతో 354 కి.మీ.జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.
ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్కు కూడా ఆహ్వానం అందింది. కాగా కేంద్ర మంత్రి గడ్కరీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నవిషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా గడ్కరీ కార్యక్రమానికి హాజరవుతానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. కాగా శంషాబాద్ సమావేశంపై జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మంత్రి కిషన్రెడ్డి భేటీ కానున్నారు.భారీ బహిరంగసభకు ఏర్పాట్లను మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షించారు.