తెలంగాణలో లాక్‌డౌన్‌పై కిషన్‌రెడ్డి ఏమన్నారంటే?....

ABN , First Publish Date - 2021-05-11T17:00:16+05:30 IST

తెలంగాణలో లాక్‌డౌన్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ లాక్‌డౌన్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని తెలిపారు.

తెలంగాణలో లాక్‌డౌన్‌పై కిషన్‌రెడ్డి ఏమన్నారంటే?....

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ లాక్‌డౌన్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని తెలిపారు. వారాసిగూడా ఎక్స్ రోడ్స్‌లో శానిటైజర్ వెహికల్స్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కులు పోలీసుల కోసం  కాదని.. తమ రక్షణ కోసం మాస్కులని గుర్తుపెట్టుకోవాలన్నారు. లాక్‌డౌన్‌లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు.‌ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కోసం లాక్‌డౌన్‌లు పెడుతున్నాయని...ప్రజలు సహకరించాలని కోరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు, సెకండ్ వేవ్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఈసీకి సంబంధించిన విషయమని... ప్రభుత్వాలది కాదని తెలిపారు. ప్రభుత్వం చేసే సూచనలను తప్పక పాటించి కరోనా చైన్‌ను బ్రేక్ చేయాలని అన్నారు. అందరికి వ్యాక్సిన్, మెడిసిన్ అందేలా 24/7 దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర దేశాల నుంచి తెప్పిస్తున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-11T17:00:16+05:30 IST