బౌద్ధ బోధనలు వసుధైక కుటుంబ సందేశాన్ని పునరుద్ఘాటిస్తాయి: Kishan Reddy

ABN , First Publish Date - 2021-07-24T22:26:02+05:30 IST

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు వీడియో సందేశం ద్వారా , ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అని బౌద్ధమతం బౌద్ధులకు మాత్రమే కాకుండా మనందరికీ వసుధైవ కుటుంబకం అనే సందేశాన్ని ఇస్తుందని కేంద్ర పర్యటాక, సాంస్క`తిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

బౌద్ధ బోధనలు వసుధైక కుటుంబ సందేశాన్ని పునరుద్ఘాటిస్తాయి: Kishan Reddy

హైదరాబాద్: ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అని బౌద్ధమతం బౌద్ధులకు మాత్రమే కాకుండా మనందరికీ వసుధైక కుటుంబమనే సందేశాన్ని ఇస్తుందని కేంద్ర పర్యటాక, సాంస్కృతిక  శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆషాఢ పూర్ణిమ శుభ సందర్భంగా ‘ధర్మ చక్ర దినోత్సవం’నాడు గురు పూర్ణిమను కూడా జరుపుకుంటామని ఆయన తెలియజేశారు.గురు పౌర్ణమి రోజున అందరం గౌరవభావంతో భక్తి శ్రద్ధలతో మన గురువులకు కృతజ్ఞతా భావంతో పూజించే రోజు.  ఆషాఢ పూర్ణిమ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు పవిత్రమైన రోజు, మానవాళికి కూడా ముఖ్యమైన రోజు” అని ఆయన అన్నారు. 


 బుద్ధుడు బౌద్ధమతానికి, హిందూ మతానికి దగ్గరి సంబంధం ఉందని ఆయన విశ్లేషించడంతో పాటు ఆయన  జ్ఞానోదయం పొందిన తరువాత,  మానవత్వం కూడా దాని నుండి ప్రయోజనం పొందేలా చూసుకున్నాడని చెప్పారు. నేటికీ, బుద్ధుని అష్టాంగమార్గాలు  మానవాళికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని, ఇవి ప్రపంచంలో అన్ని సమాజాలు శాంతియుతంగా సహజీవనం చేయడానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ గురుపూర్ణిమ  కార్యక్రమాన్ని నిర్వహించినందుకు  అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యకు కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 


ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు ఒక ఉమ్మడి వేదికను అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు. పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ) తో కలిసి ఈ ఏడాది నవంబర్ చివరలో భారతదేశంలో అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. "బౌద్ధమత గొప్పతనాన్ని గురించి ఉపన్యసించేందుకు నలుమూలల నుండి పండితులను ఆహ్వానించడం జరుగుతుందని, ఈ సంవత్సరం భారత్ తన 75 వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ తో పాటు మానవజాతికి బుద్ధుడు అందించిన మార్గదర్శకాలను కూడా ఒక పండుగ లాగా జరుపుకుంటామని ఆయన అన్నారు.శాంతి, సామరస్యానికి  చిహ్నంగా బోధ్ గయా నుండి  బోధి మొక్కను తెచ్చి నాటినందుకు కిషన్ రెడ్డి రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. “ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రధానమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-07-24T22:26:02+05:30 IST