Kishan reddy: మోదీ, కేంద్రంపై కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-09-13T21:03:09+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi), కేంద్రం (Central government)పై సీఎం కేసీఆర్‌ ( KCR) దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan reddy) మండిపడ్డారు.

Kishan reddy: మోదీ, కేంద్రంపై కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi), కేంద్రం (Central government)పై సీఎం కేసీఆర్‌ ( KCR) దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan reddy) మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ (Telangana CM)ను మించిన నియంత, అప్రజాస్వామికవాది మరొకరు లేరన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం గెజిట్‌లో ఎక్కడా లేదని తెలిపారు. విద్యుత్‌ సంస్థల బకాయిలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని,  డిస్కంలు బాగుండాలని కోరుకుంటూ కేంద్రం గెజిట్ విడుదల చేసిందని తెలిపారు. భవిష్యత్‌లో కోతలు లేని విద్యుత్ అందించాలని చెప్పామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని తామెందుకు చెబుతామని ప్రశ్నించారు. ఉచితంగా ఇస్తుంటే ఎందుకు వద్దంటామని అన్నారు. రైతుల కోసం కేంద్రం కూడా అనేక కార్యక్రమాలు చేస్తోందని కిషన్ రెడ్డి (Union minister)తెలిపారు. 

Updated Date - 2022-09-13T21:03:09+05:30 IST