కారైక్కాల్లో అదుపులో కలరా: కేంద్ర మంత్రి
ABN , First Publish Date - 2022-07-08T15:37:26+05:30 IST
పుదుచ్చేరి రాష్ట్రం కారైక్కాల్ జిల్లాలో కలరా అదుపులోకి వచ్చిందని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. కలరా లక్షణాలతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
ప్యారీస్(చెన్నై), జూలై 7: పుదుచ్చేరి రాష్ట్రం కారైక్కాల్ జిల్లాలో కలరా అదుపులోకి వచ్చిందని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. కలరా లక్షణాలతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గురువారం కేంద్ర మంత్రి మురుగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా తాగునీటి ట్యాంకుల శుభ్రం చేయడం, వీధుల్లో చెత్త తొలగించి బ్లీచింగ్ చల్లడం వంటి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో 24 మంది మాత్రమే కలరా లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కలరాపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో తగిన మందులు సిద్ధం చేశామని, ప్రజలు ఈ వ్యాధిపై భయాందోళనలు చెందనవసరం లేదని మంత్రి తెలిపారు.