అనంతపురంలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పర్యటన
ABN , First Publish Date - 2022-03-05T18:01:48+05:30 IST
జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన కొనసాగుతోంది.
అనంతపురం: జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ సంస్థకు నిర్మల శంకుస్థాపన చేయనున్నారు. 500 ఎకరాల్లో 600 కోట్ల వ్యయంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సంస్థ(నాసిన్) ఏర్పాటు కానుంది. ఇందులో ఐఆర్ఎస్కు ఎంపికైన ప్రొబెషనరీ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టుకు రెండోసారి భూమి పూజ జరుగుతోంది. 2015 ఏప్రిల్లో తొలిసారిగా అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ.. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఏడేళ్ల తర్వాత మళ్ళీ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ భూమి పూజ చేస్తున్నారు.