తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం: VK singh

ABN , First Publish Date - 2022-06-30T19:51:59+05:30 IST

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని కేంద్ర విమానయాన, రోడ్లు భవనాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం: VK singh

సూర్యాపేట: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని కేంద్ర విమానయాన, రోడ్లు భవనాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ (VK singh) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పధకాలు చేరే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ (KCR) నీళ్లు, నిధులు, నియామకం పేరుతో అధికారంలోకి వచ్చారని... వీటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై భయంతోనే కేసీఆర్ ముందుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం దేశంలో ఎక్కడా లేదని వీకే సింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-30T19:51:59+05:30 IST