ఆర్మూర్‌ మండలంలో కేంద్ర బృందం పర్యటన

ABN , First Publish Date - 2020-10-28T11:02:58+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం దేగాం, మిర్దాపల్లి గ్రామాలలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందం సభ్యులు బాలము రళీ, వంశీకృష్ణ ఈజీఎస్‌ పనులను తనిఖీ చేశారు

ఆర్మూర్‌ మండలంలో కేంద్ర బృందం పర్యటన

ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన బృందం సభ్యులు


ఆర్మూర్‌రూరల్‌, అక్టోబరు 27: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం దేగాం, మిర్దాపల్లి గ్రామాలలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందం సభ్యులు బాలము రళీ, వంశీకృష్ణ ఈజీఎస్‌ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన శ్మశాన వాటిక, కంపోస్టు షెడ్డు, విలేజ్‌ పార్క్‌, ఎవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు గ్రామపంచాయతీ భవన నిర్మాణాలను పరిశీలించారు. గ్రామాలలో అర్హులైన వా రికి పింఛన్‌ను సక్రమంగా పంపిణీ చేస్తున్నారా? లేరా అని అడిగితెలుసుకున్నారు. హరితహారంలో నాటిన మొక్కల వివరాలు, సంరక్షణ బాధ్యతలను వారు అడిగి తె లుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతో ష్‌, ఎంపీడీవో గోపిబాబు, సర్పంచ్‌లు గడ్డం సరోజ, సౌడ సాయిలత, ఉప సర్పం చ్‌లు గడ్డం గంగారెడ్డి, మధువర్మ, ఎంపీటీసీలు అనూష, భూదేవి, ఏపీవో ఉమ్మ డ సురేష్‌, కార్యదర్శులు దేవేందర్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T11:02:58+05:30 IST