చంద్రగిరి నియోజకవర్గంలో కేంద్రబృందం పర్యటన
ABN , First Publish Date - 2021-11-27T01:17:14+05:30 IST
చంద్రగిరి నియోజకవర్గంలో కేంద్రబృందం పర్యటించింది. నియోజకవర్గంలో భీమవరం, కూచివారి పల్లి గ్రామాలలో వర్షాల కారణంగా
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో కేంద్రబృందం పర్యటించింది. నియోజకవర్గంలో భీమవరం, కూచివారి పల్లి గ్రామాలలో వర్షాల కారణంగా దెబ్బతిన్న వరిపంట, చెక్ డ్యామ్లను కేంద్ర బృందం పరిశీలించింది. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కుండపోత వర్షం సృష్టించిన విలయం నుంచి జిల్లా ఇంకా తేరుకోనేలేదు. ఇప్పటికీ వేల ఇళ్లు ముంపులోనే ఉన్నాయి. వందలాది గ్రామాలకు దారుల్లేవు. ఇళ్లు కూలిపోయాయి. పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు తెగిపోయాయి. నిండుకుండల్లా ఉన్న చెరువులు అనేకం ప్రమాదకరస్థితిలో ఉన్నాయి.