Wheat exports : గోధుమల ధరల కట్టడికి కేంద్రం కఠిన నిర్ణయం

ABN , First Publish Date - 2022-05-14T17:32:38+05:30 IST

దేశంలో పెరుగుతున్న గోధుమల ధరలకు కళ్లెం వేయడం

Wheat exports : గోధుమల ధరల కట్టడికి కేంద్రం కఠిన నిర్ణయం

న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న గోధుమల ధరలకు కళ్లెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం పొద్దుపోయాక ప్రకటించింది. ఇప్పటికే జారీ అయిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌కు మాత్రమే ఎగుమతులను అనుమతిస్తామని తెలిపింది. 


రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం (War) నేపథ్యంలో నల్ల సముద్రం ప్రాంతం నుంచి గోధుమల ఎగుమతి (Wheat Export)కి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో గోధుమల కోసం అంతర్జాతీయ (Global) కొనుగోలుదారులు భారత దేశం (India)పైనే ఆధారపడ్డారు. గోధుమలు, గోధుమల ఉత్పత్తుల ధరలు మన దేశంలో 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ ధరలు 14 ఏళ్ళ గరిష్ఠానికి చేరుకున్నాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు (Supply Chains) దెబ్బతిన్నాయి. 


మన దేశంలో గోధుమల ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడంతోపాటు ఇంధన ధరలు కూడా పెరుగుతుండటం ఓ కారణం. ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం కోసం మొక్కజొన్న, గోధుమలను వాడుతుండటం మరొక కారణం. అంతర్జాతీయ ధరలు పెరుగుతుండటంతో గోధుమలకు డిమాండ్ పెరిగింది. 


Read more