ధరలు తగ్గించేశామని ప్రకటించడం హాస్యాస్పదం: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-05-23T01:40:43+05:30 IST

కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను 40 శాతం పెంచి.. కేవలం 2 శాతం మాత్రమే తగ్గించిందని, ఈ మాత్రానికే ధరలు తగ్గించేశామని ప్రకటించడం హాస్యాస్పదమని విద్యాశాఖ మంత్రి

ధరలు తగ్గించేశామని ప్రకటించడం హాస్యాస్పదం: మంత్రి బొత్స

Srikakulam: కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను 40 శాతం పెంచి.. కేవలం 2 శాతం మాత్రమే తగ్గించిందని, ఈ మాత్రానికే ధరలు తగ్గించేశామని ప్రకటించడం హాస్యాస్పదమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 2019లో పెట్రోలు ధరలను, ఇప్పటి ధరలతో పోల్చి చూడాలన్నారు.  కొన్ని దుష్టశక్తులు అడ్డు పడుతుండడం వల్ల శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్‌కి దశాబ్దాలుగా ఎన్నికలు జరగలేదని చెప్పారు. సుబ్రహ్మణ్యం మృతి  కేసులో ఎమ్మెల్సీ అనంత బాబుపై కేసు నమోదైందని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. మే 26 నుంచి 29 వరకు సామాజిక న్యాయబేరి బస్సుయాత్ర  చేపడుతున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు గురించి బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. 


Updated Date - 2022-05-23T01:40:43+05:30 IST