ఎన్నికలకు బ్యాలెట్‌ బాక్స్‌లు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2021-02-28T05:16:20+05:30 IST

ఎన్నికలకు బ్యాలెట్‌ బాక్స్‌లు సిద్ధం చేయాలి

ఎన్నికలకు బ్యాలెట్‌ బాక్స్‌లు సిద్ధం చేయాలి
వీడియో కాన్ఫిరెన్స్‌ పాల్గొన్న జేసీ స్వర్ణలత

రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో సత్యవాణి

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో సత్యవాణి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో ఆమె మాట్లాడారు. వచ్చే నెలలో జరుగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపయోగించేందుకు బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసి వివరాలను ఎన్నికల సంఘానికి పంపించాలని అన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2127 బ్యాక్సులు వర్కింగ్‌ కండీషన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటిలో పెద్దసైజులో 1520 బాక్సులు ఉన్నాయని, జిల్లాలో ఎన్నికల్లో ఉపయోగించేందుకు 65 బాక్సులు సరిపోతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో సత్యవాణికి చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీవో ఆశాలత, కలెక్టరేట్‌ ఏవో మహేష్‌బాబు, ఎలక్షన్‌ డీటీ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:16:20+05:30 IST