చెత్త తీసుకెళ్లే విషయమై వివాదం

ABN , First Publish Date - 2020-12-04T02:23:30+05:30 IST

స్థానిక రైతుబజారులో చెత్తను తీసుకెళ్లే విషయమై గురువారం మున్సిపల్‌ కార్మికులకు, రైతుబజారు వ్యాపారి గుమస్తా అయిన

చెత్త తీసుకెళ్లే విషయమై వివాదం
రైతుబజారులో నిల్వ ఉన్న చెత్తాచెదారం

 మున్సిపల్‌ కార్మికుడిపై దాడి

చెత్త తీసుకెళ్లబోమని మొండికేసిన కార్మికులు

 ఇరువర్గాలు పోలీసులకు పిర్యాదు

కావలి,డిసెంబరు3: స్థానిక రైతుబజారులో చెత్తను తీసుకెళ్లే విషయమై గురువారం మున్సిపల్‌ కార్మికులకు, రైతుబజారు వ్యాపారి గుమస్తా అయిన మహిళ మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో మున్సిపల్‌ కార్మికుడిపై గుమస్తా భర్త దాడిచేశాడు. దీంతో ఇరువర్గాలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంతడితో ఆగకుండా తమపై దాడిచేసినందున తాము చెత్తను తీసుకెళ్లమని మున్సిపల్‌ కార్మికులు మొండికేశారు. దీంతో రైతుబజారులోని రైతులు మున్సిపల్‌ కమిషనర్‌  శివారెడ్డిని కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కాని రైతుబజారులో చెత్త ఎత్తకపోతే  ఎలా అని ప్రశ్నించారు.  స్పందించిన కమిషనర్‌ గురువారం సాయంత్రం పారిశుధ్య కార్మికులను పంపి అక్కడ చెత్తను  తొలగింపచేశారు. కాగా చెత్తలో కూరగాయలు ఏరుకునే విషయమై వివాదం  చోటుకుంది.

Updated Date - 2020-12-04T02:23:30+05:30 IST