HYD : ప్రయాణికుడిపై వాంతి.. బంగారు గొలుసుతో పరారీ
ABN , First Publish Date - 2021-07-25T13:33:29+05:30 IST
తోటి ప్రయాణికుడిపై వాంతి చేశాడు. అతడు తేరుకుని కడుక్కునే...
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్ : తోటి ప్రయాణికుడిపై వాంతి చేశాడు. అతడు తేరుకుని కడుక్కునే లోపే మెడలో చైన్ లాక్కుని పారిపోయాడు. శ్రీకాకుళానికి చెందిన యోగానంద్ మూసాపేటలో ఉంటున్నాడు. శనివారం మెహదీపట్నం వెళ్లి ఆర్టీసీ బస్సులో తిరిగి వస్తున్నాడు. బస్సు బంజారాహిల్స్ రోడ్డు నెంబరు-01కు చేరుకున్న క్రమంలో పక్క సీటులోని ప్రయాణికుడు అతడిపై వాంతి చేశాడు. చిరాకుతో యోగానంద్ కడుక్కుంటుండగా, మెడలో 10 గ్రాముల బంగారు గొలుసు కనిపించలేదు. పక్క సీటులో ఉన్న ప్రయాణికుడు కనిపించలేదు. దీంతో బాధితుడు సదరు వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.