అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
ABN , First Publish Date - 2021-03-07T03:52:09+05:30 IST
పట్టణంలో వివిధ ప్రభుత్వ నిఽధులతో జరుగుతున్న అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని మునిసిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
మునిసిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి ఆదేశం
కొత్తగూడెం టౌన్, మార్చి 6 : పట్టణంలో వివిధ ప్రభుత్వ నిఽధులతో జరుగుతున్న అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని మునిసిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం పట్టణంలో జరుగుతు న్న సెంట్రల్ డివైడ్రింగ్, కుక్కల సంతానోత్పత్తి నిరోదక కేంద్రం, వైకుంఠదామంలోని బర్నింగ్ ప్లాట్ఫామ్, ఫోష్టాపీస్ సెంటర్లోని వాటర్ పౌంటెన్, బస్టాండ్ సెంటర్ అభివృద్ది పనులు, పంచతత్వ వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. అభివృద్ది పనులను నిర్నీత సమయంలో పూర్తిచేసేలా కార్యచరణ సిద్దం చేసుకుని రోజువారీ పనుల పురోగతిపై వివరాలను నివేదికల రూపంలో సమర్పించాలని ఆదేశించారు. రహదారులపై వా హనచోదకులకు అసౌకర్యం కలుగకుండా నిర్మాణ పనులను పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమిషనర్ సంపత్కుమార్, 15వ వార్డు కౌన్సిలర్ వల్లపు లక్ష్మణ్, మునిసిపల్ ఏఈ రాము, పట్టణ ప్ర ణాళిక సూపర్వైజర్ టి.ప్రభాకర్ పాల్గొన్నారు.