దేవరకొండ మార్కెట్‌ కమిటీ పాలకమండలి నియామకం

ABN , First Publish Date - 2020-12-03T05:58:55+05:30 IST

దేవరకొండ మార్కెట్‌ కమిటీ నూతన పాలకమండలిని నియమిస్తూ తెలంగాణ అగ్రికల్చర్‌ మార్కెట్‌ంగ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు.

దేవరకొండ మార్కెట్‌ కమిటీ పాలకమండలి నియామకం
చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్యను సన్మానిస్తున్న నాయకులు

 చైర్మన్‌గా శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, వైస్‌ చైర్మన్‌గా జంగారెడ్డి
దేవరకొండ, డిసెంబరు 2 : దేవరకొండ మార్కెట్‌ కమిటీ నూతన పాలకమండలిని నియమిస్తూ తెలంగాణ అగ్రికల్చర్‌ మార్కెట్‌ంగ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా దేవరకొండకు చెందిన శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, వైస్‌ చైర్మన్‌గా పేర్వాల జంగారెడ్డి, మార్కెట్‌కమిటీ సభ్యులుగా కసిరెడ్డి రవీందర్‌రెడ్డి, బోయపల్లి రాములుగౌడ్‌, బొడ్డు గోపాల్‌, వడ్త్య బాలు, షేక్‌ బురానోద్దీన్‌, ఎర్ర యాదగిరి, కుమారస్వామి దామెర, శీల కృష్ణయ్యతో పాటు గౌరవ సభ్యులుగా ప్రైమరీ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ కార్యదర్శి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, ఏడీఏ, మునిసిపల్‌ చైర్మన్‌ను సభ్యులుగా నియమించారు. శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్యను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రవీంద్రకుమార్‌తో పాటు పద్మశాలి సంఘం నాయకులు ఘ నంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి నూతన పాలకమండలి కృషి చేయాలన్నారు.

Updated Date - 2020-12-03T05:58:55+05:30 IST