పాడి రైతు కుటుంబానికి చైర్మన్ రిలీఫ్ ఫండ్ అందజేత
ABN , First Publish Date - 2021-03-02T05:39:28+05:30 IST
పరవాడ గ్రామానికి చెందిన పాడి రైతు తేగల శకుంతల(60) ఇటీవల మృతి చెందడంతో ఆమె కుమారుడు శివకుమార్కు విశాఖ డెయిరీ చైర్మన్ రిలీఫ్ ఫండ్ పథకం కింద లక్ష రూపాయల చెక్కును విశాఖ డెయిరీ మేనేజర్ జి.శ్రీరామ్మూర్తి సోమవారం అందజేశారు.
పరవాడ, మార్చి 1: పరవాడ గ్రామానికి చెందిన పాడి రైతు తేగల శకుంతల(60) ఇటీవల మృతి చెందడంతో ఆమె కుమారుడు శివకుమార్కు విశాఖ డెయిరీ చైర్మన్ రిలీఫ్ ఫండ్ పథకం కింద లక్ష రూపాయల చెక్కును విశాఖ డెయిరీ మేనేజర్ జి.శ్రీరామ్మూర్తి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ డెయిరీలో సభ్యత్వం ఉండి 60 ఏళ్లు దాటిన పాడి రైతు మరణిస్తే ఆ కుటుంబానికి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కొత్తగా ప్రవేశపెట్టిన చైర్మన్ రిలీఫ్ ఫండ్ పథకం కింద సహాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పైలా శ్రీనివాసరావు, శిరపురపు అప్పలనాయుడు, చుక్క రామునాయుడు, పైలా మురళీ, పైలా లక్ష్మణరావు పాల్గొన్నారు.