చైర్‌పర్సన్‌ వర్సెస్‌ కౌన్సిలర్లు

ABN , First Publish Date - 2022-08-11T06:01:20+05:30 IST

చైర్‌పర్సన్‌ వర్సెస్‌ కౌన్సిలర్లు

చైర్‌పర్సన్‌ వర్సెస్‌ కౌన్సిలర్లు
పార్కును ప్రారంభిస్తున్న కౌన్సిలర్‌ మంజుల ముత్యంరెడ్డి

  • వజ్రోత్సవాల్లో భాగంగా కార్యక్రమానికి రాగా అడ్డుకున్న మహిళలు
  • సముదాయించిన చైర్‌పర్సన్‌.. మొక్కలు నాటి తిరిగివెళ్లిన మంజుల 
  • ఎన్నేపల్లిలో ఫ్రీడమ్‌ పార్కును ప్రారంభించుకున్న కౌన్సిలర్లు

వికారాబాద్‌, ఆగస్టు 10 : చైర్‌పర్సన్‌ గొడవ సద్దుమునిగేలా కన్పించడం లేదు. బుధవారం మునిసిపిల్‌ పరిధిలోని ఎన్నేపల్లిలో వజ్రోత్సవాల్లో భాగంగా పార్కు ప్రారంభోత్సవంతో పాటు  మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ రావాల్సి ఉన్నప్పటికీ రాలేకపోయారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రమేష్‌, వైస్‌చైర్మన్‌ శంషాద్‌బేగంలు హాజరుకాగా.. పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ నాయకుడు గోపి కొందరు మహిళలు అక్కడికి చేరుకున్నారు. ఈక్రమంలో ఆ మహిళలు, నాయకుడు గోపి చైర్‌పర్సన్‌ను.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?మీరు ఎవరు? అంటూ ప్రశ్నించడంతో చైర్‌పర్సన్‌ వారిని సముదాయించారు. దీంతో అక్కడున్న మహిళలు.. మాకు రోడ్లు, పింఛన్లు కావాలని కోరడంతో చైర్‌పర్సన్‌ కౌన్సిలర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారిస్తామని చెప్పి పార్కులో మొక్కలు నాటి వెళ్లిపోయారు. దీంతో అక్కడ కొద్దిసేపు రసాభాసగా మారింది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత స్థానిక కౌన్సిలర్‌ మంజుల ముత్యంరెడ్డి పార్కును ప్రారంభించగా కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పలతారెడ్డి, అనంత్‌రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు షకీల్‌ నాయకులు ఉన్నారు.

Updated Date - 2022-08-11T06:01:20+05:30 IST