Yadagri:యాదగిరీశుడి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2022-09-06T02:15:25+05:30 IST
ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనృసింహుడి సన్నిధిలో సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి.
యాదగిరిగుట్ట: ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనృసింహుడి సన్నిధిలో సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి. లక్ష్మీనృసింహుడికి పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో, శివాలయంలో కొలువైన రామలింగేశ్వరస్వామికి శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలు కొనసాగాయి. వినాయక చవితిని పురస్కరించుకుని కొండపైన ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో కళాకారిణుల నాట్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. కొండకింద పాతగుట్ట శివారులోని చాకలిగిద్దె చెరువులో నిమజ్జనం చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సోమవారం వివిధ విబాగాల ద్వారా రూ. 19,13,131 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.
యాదాద్రీశుడి సేవలో ప్రముఖులు
యాదగిరీశుడిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామిని ముంబై బాడ్మింటన్ ప్రాంచైజీ యజమాని, మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ (Chamundeswaranath), సినీ నటి మంచు లక్ష్మి (manchu lakshmi), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ ఉన్డెన్మిటి క్లబ్స్ అధికారి, ఐపీఎస్ నాగేంద్రరావు యాదగిరిగుట్టను సందర్శించగా, వీరికి అర్చకులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు.