చాణక్యనీతి: ఈ 4 విషయాల్లో స్త్రీల ముందు పురుషులు తలవంచాల్సిందే..

ABN , First Publish Date - 2022-07-12T12:28:13+05:30 IST

మన దేశంలో ఎందరో మహా పండితులున్నారు.

చాణక్యనీతి: ఈ 4 విషయాల్లో స్త్రీల ముందు పురుషులు తలవంచాల్సిందే..

మన దేశంలో ఎందరో మహా పండితులున్నారు. వారిలో ఆచార్య చాణక్యుడు కూడా ఒకడు. అతని దూరదృష్టి, దౌత్యం కారణంగా, మగధ రాజు ధనానందను పదవి నుండి తొలగించి, ఆ స్థానంలో చంద్రగుప్త మౌర్యను కూర్చోబెట్టాడు. ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో కొన్ని విషయాల్లో పురుషుల కంటే స్త్రీలు ముందుంటారని, పురుషులు వారి ముందు తలొంచాల్సిందేనని తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

రెట్టింపు ఆకలి

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. పురుషుల కంటే స్త్రీలు రెట్టింపు ఆకలితో ఉంటారు. దీని వెనుక కారణం ఏమిటంటే వారు పురుషుల కంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. దీనికి తగినంత శక్తి అవసరం. అందుకే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఆహారం తీసుకుంటారు.


నాలుగు రెట్లు తెలివైనవారు

స్త్రీల తెలివి చాలా పదునైనది. మహిళలు రాబోయే సమస్యలను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉంటారు. మగవారు ఒక్కోసారి ఇబ్బందులు తలెత్తినప్పుడు భయపడుతుంటారు. స్త్రీలు తెలివిగా వాటిని ఎదుర్కొంటారు. అందుకే పురుషుల కంటే స్త్రీలకు నాలుగు రెట్లు ఎక్కువ తెలివితేటలు ఉంటాయని చాణక్య తెలిపారు. 

ధైర్యంలో..

ధైర్యం గుణం పురుషులలో ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్త్రీలు ఈ విషయంలో పురుషులను వెనుకకు నెట్టివేస్తారు. పురుషుల కంటే స్త్రీలు శారీరకంగా బలహీనులైనప్పటికీ, ధైర్యం విషయంలో వారే ముందుంటారని చాణక్య తెలిపారు. పురుషుల కంటే మహిళలు ఆరు రెట్లు అధిక ధైర్యం కలిగి ఉంటారు.

ఈ విషయంలోనూ...

లైంగిక విషయాల్లోనూ పురుషుల కంటే స్త్రీలు ఎంతో చురుకుగా ఉంటారు. దీనిని బహిరంగ పరచలేనప్పటికీ, పూర్తిగా కాదనలేమని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-07-12T12:28:13+05:30 IST