ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

ABN , First Publish Date - 2022-05-05T23:22:40+05:30 IST

ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

గుంటూరు: ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని Andhra pradesh విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, సర్వకోట, హీరామండలం, లక్ష్మీనర్సుపేట, అల్లూరి సీతారామరాజు జిల్లాలో జి. మాడుగుల, చింతపల్లె, రాజవొమంగి, జికె వీధి, కొయ్యురు, పాడేరు, డుంబ్రిగూడ, హుకుంపేటలో పిడుగులు పడే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లాలో దేవరపల్లి, చీడికాడ, నాతవరం, గొలుగొండ, మాడుగుల, విజయనగరం జిల్లాలో వేపాడ, శృంగవరపుకోట, గంట్యాడ మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షితమైన భవనాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Read more