Chandigarhలో దారుణం...మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం

ABN , First Publish Date - 2022-06-11T13:22:44+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది...

Chandigarhలో దారుణం...మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం

చండీఘడ్ (పంజాబ్):పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం జరిపిన యువకుడి బాగోతం పంజాబ్ రాష్ట్రంలోని చండీఘడ్ నగరంలో వెలుగుచూసింది.మౌలి జాగరణ్‌ ప్రాంత నివాసి అయిన యువకుడు మార్చినెలలో పంచకులలోని బుద్దన్‌పూర్ గ్రామంలోని  ఇంట్లో తనపై మొదటిసారి అత్యాచారం చేశాడని ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరించి మరోసారి తన ఇంట్లోనే తనపై జూన్ 8వతేదీన అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.నిందితుడైన యువకుడు అత్యాచారం చేసి పరారయ్యాడని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. 


బాధిత బాలిక తల్లి ఫిర్యాదుపై పోలీసులు యువకుడిపై ఐపీసీ సెక్షన్ 376(2), 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చండీఘడ్ పోలీసులు చెప్పారు. కిషన్‌గఢ్ గ్రామంలో మరో మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు ఆటో రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేశారు.అదే గ్రామంలో ఉంటున్న నిందితుడు హరిశంకర్ (40) తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని 14 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2022-06-11T13:22:44+05:30 IST