రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటుహక్కును వినియోగించుకున్న చంద్రబాబు
ABN , First Publish Date - 2022-07-18T19:38:55+05:30 IST
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అమరావతి : రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), శాసనసభ్యులు కె. అచ్చెన్నాయుడు(K Atchennaidu), ఎన్.రామానాయుడు(Ramanayudu), గద్దె రామ్మోహన్రావు)Gadde Rammohan Rao), గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao), ఎన్. చినరాజప్ప(N. Chinarajappa), పయ్యావుల కేశవ్(Payyavula kesav), ఆదిరెడ్డి భవాని తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మొత్తం 175 మంది శాసన సభ్యులలో నేటి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొత్తం 161 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 14 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును ఇంకా వినియోగించుకోవాల్సి ఉంది.