Chandrababu: సీఐడీ పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

ABN , First Publish Date - 2022-10-01T22:06:32+05:30 IST

ఏపీ సీఐడీ (AP CID) పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: సీఐడీ పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: ఏపీ సీఐడీ (AP CID) పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతకాయల విజయ్ ఇంట్లోకి దొంగల్లా పోలీసులు చొరబడ్డారని మండిపడ్డారు. ఐదేళ్ల పసిపిల్లలను పోలీసులు బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. విజయ్‌ (Vijay) కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని, సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పసిపిల్లలను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి సీఎం జగన్‌ (CM Jagan) దిగజారారని దుయ్యబట్టారు. కేసులు, విచారణల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను రౌడీల్లా ప్రతిపక్ష నేతలపైకి జగన్‌ ఉసిగొల్పుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మాజీమంత్రి అయ్యన్న కుటుంబంపై జగన్‌ సర్కార్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటిపై దాడి చేశారని గుర్తుచేశారు. ఏపీలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్ట్‌ తప్ప.. జగన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని తప్పుబట్టారు. ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగించడం సిగ్గుచేటని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2022-10-01T22:06:32+05:30 IST