దేశంలో జరిగే నేరాలలో మూడోవంతు ఏపీలోనే: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-08T17:37:49+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో మహిళ దినోత్సవ సందేశం పోస్టు చేశారు.

దేశంలో జరిగే నేరాలలో మూడోవంతు ఏపీలోనే: చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో మహిళ దినోత్సవ సందేశం పోస్టు చేశారు. సకల రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటూ ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న స్త్రీమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులను చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో జరిగే నేరాలలో మూడోవంతు ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయని నివేదికలు చెబుతుంటే.. బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. అయినా పాలకుల తీరే అలా ఉందని ఇకమీదటైనా పరిస్థితి మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Updated Date - 2021-03-08T17:37:49+05:30 IST