సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్లడం సిగ్గుచేటు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-04-21T16:22:39+05:30 IST

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్లడం సిగ్గుచేటు: చంద్రబాబు

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు పత్రికా ప్రటకన విడుదల చేశారు. ‘‘సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీయే (RTA) అధికారులు ఒంగోలులో ప్రజల కార్ లాక్కెళ్లడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనం. కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం దారుణం. భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారు? సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటు. సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళింది? ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు?’’ అని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-21T16:22:39+05:30 IST