జిల్లాల విభజనపై పునః సమీక్షిస్తా: Chandra babu

ABN , First Publish Date - 2022-05-29T01:39:55+05:30 IST

Ongole: జిల్లాల విభజనపై పునః సమీక్షిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రజల డిమాండ్లు.. అభిప్రాయాల మేరకు జిల్లాల

జిల్లాల విభజనపై పునః సమీక్షిస్తా: Chandra babu

Ongole: జిల్లాల విభజనపై పునః సమీక్షిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రజల డిమాండ్లు.. అభిప్రాయాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయాలన్న డిమాండ్‌ను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల ప్రజలు ప్రకాశం జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానన్నారు. ప్రజల దగ్గర డబ్బులు లేకపోగా.. జగన్ మాత్రం తన ఖజానాను నింపుకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించేది సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారేనని విమర్శించారు.



Updated Date - 2022-05-29T01:39:55+05:30 IST