మళ్లీ వస్తా..గాడిలో పెడతా: మినీ మహానాడులో చంద్రబాబు
ABN , First Publish Date - 2022-06-16T02:21:36+05:30 IST
అనకాపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి
అనకాపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్పై విరుచుకుపడ్డాడు.
‘‘చరిత్రలో మహానాడు తర్వాత మినీ మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి.. చోడవరంతో ప్రారంభించాం. ఇలాంటి మహానాడులు 26 పెడతాం..కేసులకు ఎవ్వరూ భయపడేది లేదు.. A2 విజయసాయిరెడ్డి విశాఖను దోచేస్తున్నాడు. విశాఖ రాజధాని అన్నారు పిడికెడు మట్టైనా వేశారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇంకా ఇలా అన్నారు..
‘‘రాష్ట్రానికి జగన్ అరిష్టంగా తయారయ్యాడు. 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్ళాడు.. మళ్లీ వస్తా గాడిలో పెడతా..అన్న క్యాంటీన్లు తెరుస్తాం.. సవాళ్లు నాకు కొత్త కాదు.. కోనసీమలో చిచ్చుపెట్టి, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం సిగ్గు చేటని’’ అన్నారు.