అర్ధరాత్రి కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు Jagan సమాధానమేంటి?: Chandrababu
ABN , First Publish Date - 2022-06-20T18:35:59+05:30 IST
అర్ధరాత్రి కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్(CM Jagan) సమాధానమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశ్నించారు.
అమరావతి : అర్ధరాత్రి కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్(CM Jagan) సమాధానమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించక తప్పదన్నారు. అయ్యన్న(Ayyannapatrudu)ది కాదు.. ఇడుపులపాయలో వైఎస్(YS) కుటుంబం చేసింది కబ్జా అని పేర్కొన్నారు. చలో నర్సీపట్నం(Narsipatnam) కార్యక్రమానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ బీసీ నేతల అరెస్టులు జగన్ వేధింపుల ప్రయత్నం కాదా? అని ప్రశ్నించారు. జగన్ కక్ష సాధింపు కోసం కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తారా? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.