నేను కుప్పం వదిలి ఎందుకు వెళ్లాలి?: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-07T19:27:58+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నేను కుప్పం వదిలి ఎందుకు వెళ్లాలి?: చంద్రబాబు

చిత్తూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో రోజు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం వైసీపీ జాగీరా? మీకు రాష్ట్రాన్ని రాశిచ్చారా? అయిదేళ్లు చరిత్రలో నిలిచిపోయేలా పరిపాలించాలి.. జగన్ రాష్ట్ర వినాశకారుడిగా మారాడు. నేను కుప్పం వదిలి ఎందుకు వెళ్లాలి? వీళ్లకు భయపడుతాననుకుంటున్నారా?’’ అంటూ ధ్వజమెత్తారు. తానొక విజన్‌తో రాష్డ్రాన్ని అభివృద్ది చేస్తే..‌ వైసీపీ అధికారంలోకి వచ్చి నాశనం చేసిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులకు... సంక్షేమ పధకాలకు సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. కుప్పం నుంచే ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిస్తున్నానన్నారు. పొత్తులు అనేవి ఎన్నికల్లో భాగమని, పరిస్థితులను బట్టి పొత్తులు అనేది కొనసాగుతాయన్నారు. తాము గతంలో పొత్తు లేకుండా కూడా గెలిచామని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-07T19:27:58+05:30 IST