ఏపీ సీఎస్కు చంద్రబాబు లేఖ
ABN , First Publish Date - 2022-02-16T01:07:24+05:30 IST
ఏపీ సీఎస్కు చంద్రబాబు లేఖ
అమరావతి: ఏపీ సీఎస్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్, రవాణాపై లేఖ రాశారు. ఇటీవల కుప్పం పర్యటనలో అక్రమ క్వారీయింగ్పై పరిశీలించామన్నారు. అక్రమాలు నిజమేనని అధికారులు నిర్ధారించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అధికారుల తనిఖీల తర్వాత కూడా అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉందన్నారు. అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్లో భాగస్వాములై ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.