Chandrababu: వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి వస్తుంది..

ABN , First Publish Date - 2022-09-05T21:39:50+05:30 IST

చెన్నుపాటి గాంధీపై దాడి వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Chandrababu: వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి వస్తుంది..

అమరావతి (Amaravathi): టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ (Chennupati Gandhi)పై దాడి వెనుక వైసీపీ (YCP) హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏదోఒకరోజు వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రజల తిరుగుబాటును ఎదుర్కోవటానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడుల సంస్కృతికి తెరతీసిందని మండిపడ్డారు. వైసీపీ దాడుల వెనుక సీఎం జగన్ (CM Jagan) ఉన్నారని, దాడి ఎమోషనల్‌గా జరిగిందన్న విజయవాడ కమిషనర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. కమిషనర్ కుటుంబానికి ఇలాంటిది జరిగితే ఆ బాధేంటో తెలుస్తుందన్నారు. పోలీసులే నేరస్థులకు అండగా ఉండే పరిస్థితి వచ్చిందని, టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే వైసీపీ దాడులకు దిగుతోందన్నారు. వైసీపీ దాడులకు టీడీపీ భయపడదని, తీవ్ర పరిపరిణామలుంటాయని హెచ్చరించారు. రౌడీయిజాన్ని నమ్ముకున్న వారు మార్చురీకి పోవాల్సిందేనన్నారు. రాజకీయాల కోసం చెన్నపాటి గాంధీ ఆస్తులు పోగొట్టుకున్నారని, రౌడీయిజాన్ని నమ్ముకుని వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తప్పుడు కేసులతో జైలుకు వెళ్ళిన టీడీపీ కార్యకర్తలను ఆదుకుంటామన్నారు. గాంధీపై దాడి కేసును లాజికల్‌గా ఎదుర్కొంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-05T21:39:50+05:30 IST