ప్రతిపక్ష నేతలకు పర్యటించే హక్కులేదా: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-07-10T00:57:12+05:30 IST

రౌతులపూడిలో టీడీపీ నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష

ప్రతిపక్ష నేతలకు పర్యటించే హక్కులేదా: చంద్రబాబు

విజయవాడ: రౌతులపూడిలో టీడీపీ నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో మానవహక్కులను హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు జరిపితే భయం దేనికన్నారు. పంచభూతాలను వైసీపీ నేతలు అడ్డంగా దోచేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనలో రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. సీబీఐతో విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గుతేల్చాలన్నారు. అప్పటివరకు విశాఖ మన్యంలో తవ్వకాలను నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  

Updated Date - 2021-07-10T00:57:12+05:30 IST