Chandrababuకు అపూర్వ స్వాగతం
ABN , First Publish Date - 2022-05-19T00:56:53+05:30 IST
జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఆ పార్టీ నేత అపూర్వ స్వాగతం పలికారు.
కడప: జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఆ పార్టీ నేత అపూర్వ స్వాగతం పలికారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి కడప ఎయిర్పోర్టు (Kadapa Airport)కు చంద్రబాబు 11.45 గంటలకు చేరుకున్నారు. 12.30కి ఎయిర్పోర్ట్ బయట ఉన్న ఓపెన్ టాప్ వెహికల్లో బయలుదేరి నగర శివారుల్లో ఉన్న ఫంక్షన్ హాలుకు వచ్చారు. సుమారు 800 వాహనాలతో పాటు, ద్విచక్ర వాహనాలలో చంద్రబాబుకు భారీ ర్యాలీ పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబుకు నీరాజనాలు పలికారు. ఇర్కాన్ సర్కిల్లో టీడీపీ నేత లక్ష్మిరెడ్డి, మన్మోహన్రెడ్డిలు చంద్రబాబుకు క్రేన్ ద్వారా గజమాల వేసి సత్కరించారు. ఎయిర్పోర్టు నుంచి కల్యాణ మండపానికి చేరుకునేందుకు సుమారు గంట సమయం పట్టింది. సీఎం సీఎం... జై చంద్రబాబు అనే నినాదాలతో ఫంక్షన్హాలు మార్మోగిపోయింది. ఉహించని విధంగా టీడీపీ శ్రేణులు పోటెత్తడంతో టీడీపీ నేతలు ఉబ్బితబ్బిబ్బైపోయారు.