చంద్రబాబు పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2021-10-12T06:26:11+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన రద్దయింది.

చంద్రబాబు పర్యటన వాయిదా

చిత్తూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన రద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న నాలుగు రోజుల్లో బలమైన వర్షాలున్నందున పర్యటన వాయిదా పడినట్లు టీడీపీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. నేటినుంచి మూడురోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి బహిరంగ సభలు, స్థానిక నేతలతో సమావేశాలను నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. సోమవారం కుప్పంలో రోజంతా వర్షం పడడంతో సాయంత్రం స్థానిక, జిల్లా నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పర్యటన గురించి చర్చించి.. జిల్లా నేతల సలహా మేరకు పర్యటనను రద్దు చేశారు. దసరా పండుగ తర్వాత చంద్రబాబు పర్యటన ఉండొచ్చని.. ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని టీడీపీ నేతలు తెలిపారు.

Updated Date - 2021-10-12T06:26:11+05:30 IST