AP News: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-08-24T23:36:05+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుప్పం (Kuppam) పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

AP News: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుప్పం (Kuppam) పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో వైసీపీ జెండాలు ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ జెండాలు పెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ (YCP) జెండాలను తొలగించేందుకు టీడీపీ శ్రేణుల యత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులను  పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ (TDP) శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి.  భారీగా పోలీసుల మోహరించారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం కొల్లపల్లెలో ఈ ఘటన జరిగింది. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా చంద్రబాబుకు ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగత ఏర్పాట్లు చేశారు. రామ కుప్పం పట్టణంలోని ఆటోస్టాండ్‌ సర్కిల్‌ నుంచి బహిరంగసభ జరిగే పోలీసుస్టేషను సర్కిల్‌ వరకు  తోరణాలతో అలంకరించారు. రామకుప్పం పట్టణంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-08-24T23:36:05+05:30 IST