డీజీపీకి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2021-07-31T03:02:15+05:30 IST

రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. మాజీ ఎమ్మెల్యే

డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి: రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ డీజీపీకి చంద్రబాబు లేఖ రాసారు. అక్రమ మైనింగ్‌ను రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారని లేఖలో పేర్కొన్నారు. దీంతో రామకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులను చంపేస్తాం, ఆస్తులు ధ్వంసం చేస్తామని మైనింగ్ మాఫియా బెదిరిస్తుందన్నారు. దీనిపై రామకృష్ణారెడ్డి గతంలోనే పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రామకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులకు వెంటనే రక్షణ కల్పించాలని చంద్రబాబు లేఖలో కోరారు. 

Updated Date - 2021-07-31T03:02:15+05:30 IST