జగన్‌ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్‌ నడుస్తోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-04-18T21:10:20+05:30 IST

సీఎం జగన్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్‌ నడుస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు.

జగన్‌ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్‌ నడుస్తోంది: చంద్రబాబు

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్‌ నడుస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ సీఎం మోసపు రెడ్డి పాలనతో అన్నివర్గాల జీవితాల్లో అంథకారం అలుముకుందన్నారు. జగన్ సొంతవర్గం కూడా తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉందన్నారు. సీఎం అపరిచితుడి నిర్ణయాలతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు. నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాణి హస్తం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎంత బలహీనుడో అతని కేబినెట్‌ చూస్తేనే అర్థమవుతోందన్నారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనన్నారు. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టానని చెప్పిన జగన్... ఇప్పుడు మొదటి వారంలో కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈనెల 21న టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2022-04-18T21:10:20+05:30 IST