బొప్పన రాఘవేంద్రరావు మరణం బాధాకరం: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-07T16:25:16+05:30 IST

టీడీపీ సీనియర్ నాయకుడు బొప్పన రాఘవేంద్రరావు మరణం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

బొప్పన రాఘవేంద్రరావు మరణం బాధాకరం: చంద్రబాబు

విజయవాడ: టీడీపీ సీనియర్ నాయకుడు బొప్పన రాఘవేంద్రరావు మరణం బాధాకరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, పార్టీ ఆవిర్భావం నుంచి రాఘవేంద్రరావు తన ఆఖరి శ్వాస వరకు పార్టీ ప్రగతికి కృషి చేశారని కొనియాడారు. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రజా చైతన్య యాత్రలో భాగస్వామ్యమయ్యారని, కృష్ణాజిల్లాలో టీడీపీ  జెండా పట్టిన మొదటి వ్యక్తి రాఘవేంద్రరావు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నేతగా పార్టీకి విశేష సేవలందించారన్నారు. రాఘవేంద్రరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు. వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా వుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. బొప్పన రాఘవేంద్రరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి మృతి చెందారు. 

Updated Date - 2021-11-07T16:25:16+05:30 IST