చంద్రబాబువి బురద రాజకీయాలు: జగన్
ABN , First Publish Date - 2021-11-29T22:08:44+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబువి బురద రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకునేందుకు శరవేగంగా
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబువి బురద రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకునేందుకు శరవేగంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గతంలో బాధితులను ఆదుకునేందుకు కనీసం నెల పట్టేదన్నారు. ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితులకు ఆదుకోగలిగామని చెప్పారు. నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి.. సీజన్లోగా వారికి సహాయం అందిస్తున్నామని జగన్ తెలిపారు.